గానం శ్రీమతి మోచర్ల పద్మనాభ కస్తూరి గారు
రచన శ్రీమతి డా. వేదాల గాయత్రి దేవి గారు
తిరుప్పావై-పాశురం 8
సీ.తూరుపుతెలవారె తోయజమిత్రుడు
ఉదయగిరినిచేరనుద్యమించె
మేతకొరకుపోవుమేలైన యెనుములు
తమముపోయిన ,రీతితరలిపోయె
కేశినోటినిచీల్చి.,కేశిసూదనుడైన
చాణూరముష్టుల ,సంహరించు
కృష్ణనామమ్మును కీర్తించినోరార
పాడికొలుతుమమ్మ ,పడతిలెమ్ము
తే.గీ.సత్త్వగుణదాత ,శాస్త్రార్ధ సారమతడు
రాజతామససంహారి ,రాజసముడు
సాధురక్షణశీలుని.సన్నుతింప
దేవదేవునిపొందెడి ,తీరునిదియె.
రచన శ్రీమతి ఆకుండి శైలజ గారు
* 8 వ పాశురము*
సీ....
ఆకాశమంతటా అన్నిదిక్కులలోన
అరుణోదయంబయ్యె నదివొ గనవె
గోశాలలన్ వీడి గోకులంబంతయు
గ్రాసమ్ము మేయగ కదలుచుండె
కృష్ణునే కీర్తించు తృష్ణతో గోపికల్
వెడలుచుండెను చూడు వేడ్కతోడ
చాణూర మల్లుల సంహరించెడు వాని
సేవించ వలె సఖీ చేర రావె...!!!
తే.గీ....
శీఘ్రముగ లేచి రావేమి చిన్నదాన
వాసుదేవుని గీర్తించ వరము లిడును
పొందగ పఱైని శుభముగ నందరమును
జాగు సేయక రావమ్మ జలజనయన.!!!
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి