శ్రీమతి మోచర్లపద్మనాభకస్తూరి గారు గానం చేసిన
డా.వేదాల గాయత్రిదేవి గారు రచించిన
తిరుప్పావై-పాశురం 7
సీ.ఏటిరింతలుకల్సి యేమేమొమాటల
నూసులాడెనదియె నువిదలెమ్ము.
దధిమధనమ్మున తడవతడవకును
గలగలధ్వనియించు ,గాజులవియె
స్రస్తవేణీబంధసౌగంధలహరుల
గొల్ల భామజడను ,కుసుమచయము
కేశిసూదనుహరికీర్తించువేళల
నారాయణుని దివ్య నామమరసి
ఆ.వె.రూపగుణవిభవరోచిష్ణుకృష్ణుని
పాపచయవిదూరు పరమపురుషు
వేదశాస్త్రవినుతు ,విశ్వేశుకీర్తింప
వేగలేవవమ్మ ,వేకువయ్యె.
శ్రీమతి ఆకుండి శైలజ గారి రచన
7 వ పాశురము
సీ....
తెల్లవారుచునుండె దినకరుండుదయించె
పక్షుల కిలకిలల్ పలుకరించె
సుదతుల కంఠాల సూత్రాల సవ్వడుల్
కరముల కడియాల స్వరము లవియె
గొల్లభామలు చిల్కు చల్ల రావంబులు
మంజులమ్ముగ తాకె మానసముల
మాకందరకు నీవు మంచి నాయికగాదె
హరికీర్తనము జేయ తరలిరావె
తే.గీ....
ప్రొద్దు పొడుపున నాదాలు పొలతి వినవె
శయ్యపైనుండి దిగనీకు శ్రమ మదేమి
ఆలకించుచు నన్నియు నేల మగత
తలుపు దీయంగ రావేమి తలిరుబోడి!!!
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి