21, మే 2020, గురువారం








సమకాలీన విశిష్ట కవి, నేటి మేటి సుకవి  శ్రీ శ్రీధర్ కొమ్మోజు గారి శతకాన్ని అవలోకిద్దాం.  వీరు వృత్తి రీత్యా గణితో పాధ్యాయులే కానీ వీరిలోని అమ్మభాష పట్ల మమకారం వీరిని తెలుగు సుకవిగా మలచింది. వీరి ఈశ్వరమ్మ శతకం చదివేవారికి అలౌకిక అనుభూతిని, ఆనందాన్ని అందిస్తుందని నిస్సంకోచంగా చెప్పవచ్చు. అమ్మ ప్రేమకు సాటి మరేదీ లేదు కదా అమ్మ ని అమితంగా ప్రేమించే మనిషి మహనీయుడు కాక మరేమౌతాడు. వీరి శతకంలో మకుటంగా అమ్మపేరు నుంచుకుని నూటఎనిమిది పర్యాయములు అమ్మ పేరుని స్మరించేరంటే  అమ్మ సాక్షాత్కరించదా.... ఆ అమ్మలగన్నయమ్మ కి ఈ అమ్మ ప్రతిరూపంకాదా.. అంతటి అమ్మ వరాన్ని సాధించిన వీరి శతకం అమూల్యం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి